LIVE: వైఎస్ సునీత మీడియా సమావేశం- ప్రత్యక్షప్రసారం - YS Sunitha Press Meet

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 11:02 AM IST

Updated : Apr 15, 2024, 12:44 PM IST

thumbnail

YS Sunitha Press Meet Live: వైఎస్‌ వివేకా హత్య విషయంలో న్యాయం చేయాలని వైఎస్ షర్మిల, సునీతా పులివెందుల నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించారు. 'మీ ఆడ బిడ్డలం కొంగుచాచి అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి' అంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఓటమి భయంతోనే జగన్ తమను అడ్డుకుంటున్నారని షర్మిల ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకానందరెడ్డి కుమార్తె సునీత కడప జిల్లాలో శుక్రవారం పర్యటించారు. పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల, సునీత పాల్గొన్నారు. సభ ప్రారంభ సమయంలో విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో షర్మిల వైఎస్సార్సీపీపై, సీఎం జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వివేకా విషయంలో జగన్‌ న్యాయం చేయలేకపోయారని షర్మిల ధ్వజమెత్తారు. షర్మిల మాట్లాడుతూ ఒక వైపు వైఎస్సార్ బిడ్డ మరో వైపు హంతకుడు ఉన్నాడని, తమ వైపు న్యాయం, ధర్మం ఉందని అన్నారు. వైఎస్‌ఆర్‌ బిడ్డ కావాలో? వివేకా హత్యకేసు నిందితుడు అవినాష్‌రెడ్డి కావాలో పులివెందుల ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో వైఎస్ వివేకా కుమార్తె సునీత మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.

Last Updated : Apr 15, 2024, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.