పదవుల కోసం తమ్ముణ్ని చంపితే వైఎస్సార్ తట్టుకునేవారా?: సునీత - YS Sunitha in Election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 7:45 PM IST

thumbnail

YS Sunitha in Election Campaign: రాజకీయాల కోసం తన తండ్రిని కిరాతకంగా హత్య చేయించిన అవినాష్‌రెడ్డికి ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కోరారు. తన తండ్రిని క్రూరంగా హత్య చేయించిన వాళ్లే మళ్లీ ఎంపీ బరిలో ఉన్నారని మండిపడ్డారు. వైఎస్‌ షర్మిలను ఎంపీ చేయాలని తన తండ్రి వివేకానందరెడ్డి ఎంతగానో తాపత్రయపడ్డారని సునీత అన్నారు. వివేకా ఆశయాన్ని షర్మిల నెరవేరుస్తారని, ఆమెకు ప్రజలంతా మద్దతు ఇచ్చి గెలిపించాలని సునీత పిలుపునిచ్చారు. 

వైఎస్సార్‌ జిల్లాలో ఏపీ కాంగ్రెస్​ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన బస్సు యాత్రలో సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడారు. కడపలో తన తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందని సునీత అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉంటే దీన్ని సహించేవారా అంటూ సునీత ప్రశ్నించారు. పదవుల కోసం తమ్ముణ్ని చంపితే చూసి తట్టుకునేవారా అని ప్రశ్నించిన సునీత, కడప ఎంపీగా షర్మిలను దీవించి, అవినాష్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.