ఆలయంలో వైసీపీ ఎన్నికల ప్రచారం- మండిపడుతున్న భక్తులు - YCP election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 6:39 PM IST

thumbnail

YCP Leaders Election Campaign in Dwaraka Tirumala : ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం వైసీపీ ఎన్నికల ప్రచారానికి అడ్డాగా మారింది. ఇంతవరకు వైసీపీ నేతల ప్రచారానికి ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో పాటు తాజాగా ఆలయ ట్రస్ట్​ బోర్డు సభ్యులు కూడా ఆ జాబితాలో చేరారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘిస్తూ దేవస్థానం ట్రస్ట్​బోర్డు సభ్యుడు యానాదయ్య వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఇందుకు నిదర్శనం.

ద్వారకా తిరుమల కేశఖండనశాలలో క్షురకులను కలిసి సీఎం జగన్​కు ఓటు వేసి గెలిపించాలని ట్రస్ట్ ​బోర్డు సభ్యుడు యానాదయ్య కోరారు. దేవస్థానం ప్రాంగణంలో ఎన్నికల ప్రచారం చేయడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు స్పందించకపోవడం పట్ల వైసీపీకి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో వైసీపీ ఎంపీ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలకు ఆలయంలో భోజనాలు ఏర్పాటు చేయడంపై ఈవో ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.