వాలంటీర్లకు వైఎస్సార్సీపీ నేతల వాయిస్‌ మెసేజ్‌- బాలశౌరి మీటింగ్‌కు వెళ్లిన వారి వివరాలు నోట్‌ చేయాలని ఆదేశం - YCP Leader Voice Message Volunteers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 12:47 PM IST

thumbnail

YCP Leader Voice Message in Volunteers Whatsapp Group: అధికారం ఉందనే అండతో వైఎస్సార్సీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఓ వైసీపీ నేత ప్రతిపక్ష నేత మీటింగ్​కు వెళ్లే వారిని గుర్తు పెట్టుకోవాలని వాలంటీర్లకు చెబుతున్నారు. జనసేన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balasouri) కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాలశౌరి మీటింగ్​కు ఎవరెవరు వెళ్తున్నారో నోట్ చేసుకోవాలని రాజీనామ చేసిన వాలంటీర్లకు వైఎస్సార్సీపీ నేత ఆదేశాలు జారీ చేశారు.  

Janasena Leader Balasouri election Campaign: బాలశౌరి మీటింగ్​కు వెళ్లిన వారి వివరాలు తమకు ఇవ్వాలని 3వ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ (Deputy Mayar) భారతీ భర్త శీలం బాబ్జీ వాలంటీర్లకు వాయిస్ మెసేజ్​లు (voice Message in Volunteers) పంపారు. వాలంటీర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి గంగులతోటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు రావాలని వాలంటీర్ల గ్రూప్​లో శీలం బాబ్జీ వాయిస్ మెసేజ్ పంపించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.