ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతలు - నామినేషన్ వేసేందుకు వెళ్తూ - Election Code violation

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 3:48 PM IST

thumbnail
()

YCP Leader Election Code Violation in Bapatla District : రాష్ట్రంలో వైసీపీ నాయకులు యథేచ్చగా ఎన్నికల కోడ్​ను ఉల్లంఘిస్తున్నారు. తమకు ఎన్నికలు నిబంధనలు వర్తించవన్నట్లుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. బాపట్ల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా నందిగామ సురేష్, కోన రఘుపతి నామినేషన్లు వేసే క్రమంలో ఎన్నికల కోడ్​ను ఉల్లఘించారు. వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు ఎన్నికల కమిషన్​కు విజ్ఞప్తి చేశారు.

ఇవాళ వైసీపీ నాయకులైన నందిగామ సురేశ్​, కోన రఘుపతి నామినేషన్​ సందర్భంగా కొమ్మినేని రైస్ మిల్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా చేపట్టారు. నామినేషన్​ వేసే సమయంలో బాణసంచా కాల్చరాదని పోలీసులు నిబంధనలు విధించారు. కానీ పోలీసులకు నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ అభ్యర్థుల ర్యాలీలో కార్యకర్తలు బాణసంచా కాల్చరు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు సిబ్బంది ఆర్వో కార్యాలయానికి సమీపంలో పార్టీ శ్రేణుల నుంచి బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నాయకులు నామినేషన్​ ప్రక్రియలో భారీ ర్యాలీని నిర్వహించడం వల్ల ట్రాఫిక్​ ఇబ్బందులు ఎదురై వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.