కాలం సామాన్యుని నుంచి తత్వవేత్తల వరకు అందరికీ పరీక్ష పెడుతుంది

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 7:21 PM IST

thumbnail

Umar Alisha 96th Mahasabhalu 2024 : కాకినాడ జిల్లా పిఠాపురంలో పీఠం ప్రధాన ఆశ్రమంలో పీఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ అలీషా ఆధ్వర్యంలో 96వ వార్షిక జ్ఞాన మహా సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నన్నయ్య యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ పద్మరాజు పాల్గొన్నారు. మానవుడి జీవనంలో ఎదురయ్యే కష్టాలు, దు:ఖాలు, బాధలను ఎదుర్కోవాలంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అలీషా పేర్కొన్నారు. కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఈ సృష్టిలో ఏదీ లేదన్నారు. సామాన్యుని మెుదలుకొని తత్వవేత్తల వరకు కాలం అందరికీ పరీక్ష పెడుతుందని ఆయన తెలిపారు.

Speech of Dr. Umar Alisha : దైవం మానుష్య రూపేణా అనే మాటలకు నిలువెత్తు నిదర్శనం అలీషా అని వైస్‌ ఛాన్సలర్‌ పద్మరాజు అన్నారు. సర్వ మానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడుతున్న అలీషా సేవలను కొనియాడారు. పీఠాధిపతి ద్వార జ్ఞానాన్ని పొందిన శిష్యులు ఆ జ్ఞానాన్ని మరింత మందికి అందించాలని ఆయన సూచించారు. అలీషా రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ ద్వారా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, పక్షుల కోసం తయారు చేసిన ధాన్యపు కుచ్చులను విద్యార్థులకు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.