విజయవాడలో ఇరువర్గాల బాహాబాహీ - పోలీసుల రాకతో పరార్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 8:05 AM IST

thumbnail

Two Gangs Halchal at High Tension Road in Vijayawada: విజయవాడ పటమట స్టేషన్ పరిధిలోని హైటెన్షన్ రోడ్డులో మరో గ్యాంగ్ వార్ త్రుటిలో తప్పింది. పటమట పోలీసు స్టేషన్‌ పరిధిలోని హైటెన్షన్‌ రోడ్డులో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో మొదట నలుగురు యువకులు అక్కడకు చేరుకున్నారు. వారి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఇరువర్గాలకు చెందిన యువకులు వారి స్నేహితులను పిలిచారు. నిమిషాల వ్యవధిలో అక్కడకు సుమారు 40 మంది యువకులు రావడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. 

కర్రలు, ఇనుప రాడ్లతో బాహాబాహీకి దిగారు. ఒక వర్గం యువకులు ఎక్కువగా ఉండటంతో మరో వర్గంలోని కొంతమంది యువకులు బైకుపై పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో ఆ వర్గం యువకులు కర్రలు, రాడ్లు పట్టుకుని వెంబడించారు. వారిని లక్ష్యంగా చేసుకుని రాళ్లు విసరడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ ఘర్షణ వాతావరణం కొనసాగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోవడంతో ఇరువర్గాల యువకులు పరారయ్యారు. నాలుగేళ్ల క్రితం పండు, సందీప్‌ వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్‌ వార్‌లో సందీప్‌ మరణించిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దాదాపు ఇలాంటిదే ప్రస్తుతం మరొకటి తుట్రిలో తప్పింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.