LIVE : నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి ప్రెస్ మీట్
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Feb 5, 2024, 4:22 PM IST
|Updated : Feb 5, 2024, 4:44 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-02-2024/640-480-20670325-thumbnail-16x9-komatireddy.jpg)
Minister Komatireddy Press Meet Live in Nalgonda : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో జరిగిన ప్రగతి శూన్యమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడానికే కానీ ఒక్క అభివృద్ధి పని చేయలేదని విమర్శించారు. మరోవైపు తెలంగాణకు చెందిన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపైనా కోమటిరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తోందని బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు రాబోయే పార్లమెంటు ఎన్నికలపై కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల కోసం కృషి చేసినట్టే రానున్న లోక్ సభ ఎన్నికల్లోనూ పార్టీ విజయం కోసం అందరూ కలిసి కట్టుగా పని చేయాలని మార్గనిర్దేశం చేశారు.