అప్పుల కోసం తప్పుడు లెక్కలు - అడ్వాన్స్ ఎస్టిమేషన్ అంటూ కాకి లెక్కలు చూపించిన జగన్​ రెడ్డి: విజయ్ కుమార్ - TDP state spokesperson Vijaykumar

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 4:40 PM IST

thumbnail

TDP state spokesperson Nilayapalem Vijaykumar : జీఎస్‌డీపీపై జగన్ రెడ్డి బురిడీ లెక్కలు బట్టబయలయ్యాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ వెల్లడించారు. అప్పులతో ఏపీని జగన్ రెడ్డి బంగాళాఖాతంలో కలుపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ రెండు నెలల్లో వీలైనంత బొక్కడానికి మళ్లీ 94 వేల కోట్లు జగన్ రెడ్డి అప్పులు చేశారని ఆరోపించారు. ప్రతినెల రాష్ట్ర సంపాదన 7,971 కోట్లు అప్పు అడుగుతున్నది 7,833 కోట్లా అని నిలదీశాారు.

రాష్ట్రంలో ఎంత ఆదాయం ఉంటే జగన్​ రెడ్డి అంత అప్పులు తెస్తున్నాడని విజయ్‌కుమార్‌ దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వాన్స్ ఎస్టిమేషన్ అంటూ కాకి లెక్కలు, సాక్షిలో తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. రాష్ట్రంలో చూస్తే ఎక్కడా కూడా వచ్చిన కంపెనీలు, జరిగిన అభివృద్ధి, ఎక్కడా కనపడని వైనం ఉందని అన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై కాకి లెక్కలతో అప్పులు చేస్తూ జగన్ సర్కార్ కేంద్రాన్ని మోసగిస్తుందని విజయ్‌కుమార్‌ ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.