'శవ రాజకీయాలు వైఎస్సార్సీపీకి వెన్నతో పెట్టిన విద్య - సొంత చెల్లి, తల్లికే రక్షణ లేదు'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 5:43 PM IST

thumbnail

GV Reddy's Anger Against YSRCP : శవ రాజకీయాలు చేయడం వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి దుయ్యబట్టారు. గీతాంజలితో సంక్షేమ పథకాల పబ్లిసిటీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయించిందని ఆరోపించారు. ట్రైన్ యాక్సిడెంట్‌ని రాజకీయ హత్యగా మార్చిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదని మండిపడ్డారు. సాక్షి పేపర్‌లో ‘'ఓ చెల్లిని చంపేశారు'’ అని పెద్ద అక్షరాలతో రాయడం సిగ్గుచేటని జీవీరెడ్డి ధ్వజమెత్తారు. 

గీతాంజలికి సంక్షేమ పథకాల ప్రచారానికి ట్రైనింగ్ తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్‌లోనే జరిగిందని ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మఒడి 4 సార్లు ఇచ్చి 5 సార్లు ఇచ్చామని అమాయకపు ప్రజలతో చెప్పించడం దుర్మార్గమన్నారు. కారణాలు తెలియని హత్యను తెలుగుదేశం-జనసేనకు అంటించడం జగన్ రెడ్డి నీచ చరిత్రకు నిదర్శనమని అన్నారు. జగన్ రెడ్డి ప్రచార పిచ్చికి ఓ నిండు ప్రాణం బలైందని మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో సొంత చెల్లి, తల్లికే రక్షణ లేదని జీవీరెడ్డి విమర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.