నాడు - నేడు పనులపై వైఎస్సార్సీపీది ప్రచార ఆర్భాటం మాత్రమే: వెనిగండ్ల రాము

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 12:06 PM IST

thumbnail

TDP Leader Venigandla Ramu Taking Selfie Challenge: కృష్ణాజిల్లా జిల్లా మామిడికొళ్లలో 36 లక్షల నిధులతో చేపట్టిన మండల పరిషత్‌ పాఠశాల పనులు గత నాలుగేళ్లలో పునాదులు కూడా దాటలేదని గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి వెనిగండ్ల రాము ఆరోపించారు. పాఠశాల దుస్థితిని సెల్ఫీ వీడియో తీస్తూ ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. నాడు-నేడు పనులపై (Nadu Nedu Works) వైసీపీ ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో అంతా సున్నానేనని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం చేతకానితనానికి గుడివాడ నియోజకవర్గంలో దర్శనమిస్తున్న పాఠశాలలే నిదర్శనమని పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పని చేయటం చేతకాదు అని చెప్పడానికి గుడివాడలో ఉన్న పాఠశాలలే నిదర్శనం. ముందు స్కూల్​ కట్టకుండా వంట గది, మరుగుదొడ్లు నిర్మించారు. నాడు-నేడు పనులపై ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదు. వైసీపీ ప్రభుత్వ పాలకులు ఎంత మేధావులో వీటిని చూస్తే అర్థమైపోతుంది. చేతకాని ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిస్థితులు ఇలానే ఉంటాయి. - వెనిగండ్ల రాము, గుడివాడ టీడీపీ బాధ్యుడు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.