వందల కోట్ల ప్రజాధనం లూటీ- వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధం: నల్లారి కిషోర్ - Nallari Kishore interview
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 8, 2024, 1:38 PM IST
TDP Leader Nallari Kishore Kumar Reddy Interview: ఐదు సంవత్సరాలుగా అవినీతి, అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు వైసీపీని ఇంటి సాగనంపటానికి సిద్ధంగా ఉన్నారని చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు వందల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని కిషోర్ కుమార్ అన్నారు. వైసీపీ దాడులను గమనించిన ఈసీ రాయచోటి, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరులో వంద శాతం వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. ప్రజలు భయపడకుండా స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని నల్లారి కిషోర్ పేర్కొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని కిషోర్ కుమార్ విమర్శించారు. భూములు, మైనింగ్, ఇసుకలో అవినీతి డబ్బు సంపాదించారనే భావన ప్రజల్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పీలేరులో తన విజయం తథ్యమంటున్న టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణప్ప నిర్వహించిన ముఖాముఖి.