పార్టీ మారే ఉద్దేశం లేదు- టీడీపీలోనే కొనసాగుతా: వైకుంఠం ప్రభాకర్ చౌదరి - TDP Prabhakar Meeting with Cadre

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 7:55 PM IST

thumbnail

TDP Prabhakar Chowdary Meeting with Cadre: తనకు పార్టీ మారే ఆలోచన లేదని, టీడీపీలోనే కొనసాగుతానని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చెప్పారు. అనంతపురం టికెట్ రాకపోవడంతో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాను పార్టీకి చేసిన సేవను చంద్రబాబు గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు నియోజకవర్గంలో అనేక మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే, సొంతగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకుని పోరాడుతున్నామని తెలిపారు. విద్యార్థి సంఘ నాయకుడి స్థాయి నుంచి రాజకీయాల్లో స్వయం కృషితో ఎదిగానన్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు రెండు, మూడు రోజుల్లో తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటానన్నారు. 

"నాకు పార్టీ మారే ఆలోచన లేదు. టీడీపీలోనే కొనసాగుతాను. అయితే నేను చేసిన సేవను చంద్రబాబు గుర్తించలేదు. నాతోపాటు నియోజవర్గంలో నియోజకవర్గంలో అనేక మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే, సొంతగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకుని పోరాడుతున్నాను. పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు రెండు, మూడు రోజుల్లో తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటాను." - వైకుంఠం ప్రభాకర్ చౌదరి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.