LIVE జగ్గంపేట ప్రజాగళం సభలో చంద్రబాబు- ప్రత్యక్షప్రసారం - Chandrababu Prajagalam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 4:46 PM IST

Updated : Apr 22, 2024, 5:20 PM IST

thumbnail

TDP Chief Chandrababu Prajagalam Live: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలు జోరుగా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ సర్కారుపై చంద్రబాబు గర్జించిన సింహంలా విరుచుకుపడుతున్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో వైఫల్యాలను ఎండగడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో కూటమి ప్రచార వేగం మరింత పెంచింది. ఇప్పటికే ఆరు నియోజకవర్గాల్లో ప్రజాగళం- వారాహి విజయోత్సవ సభలు విజయవంతంగా నిర్వహించిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్​కు తోడుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇతర బీజేపీ జాతీయ నేతలు జతకట్టనున్నారు. నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేటల్లో ఒకటి, మరోచోట బహిరంగ సభల్లో ప్రధాని మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి పాల్గొనేలా కూటమి ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈలోగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం జగ్గంపేట నియోజకవర్గంలో చంద్రబాబు  ప్రజాగళం సభ ప్రత్యక్ష ప్రసారం.

Last Updated : Apr 22, 2024, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.