డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని విద్యార్థులు, స్థానికుల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 1:37 PM IST

thumbnail

Students and Residents Protest On Drainage Issue In Sunkarapalem: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు, విద్యార్థులు ఆందోళనకు చేపట్టారు. జాతీయ రహదారి విస్తరణ (National Highway Expansion)లో భాగంగా నిర్మించిన డ్రైనేజీ నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవటంతో మురుగు నీరు రహదారిపై ప్రవహిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Residents of Sunkarapalem Raised Slogans to Solve Drainage Problem: మురుగు నీటి (Sewage) నుంచి వచ్చే దుర్వాసన వల్ల స్థానికులు, విద్యార్థులు ఆనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన చెందుతున్నారు. డ్రైనేజీ సమస్య గురించి స్థానిక అధికారులకు (Regional Officers), నేషనల్ హైవే అథారిటీ సిబ్బందికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు నిరసన చేపట్టారు. అధికారులు స్పందించి తక్షణమే డ్రైనేజీ నుంచి వచ్చే నీరును రోడ్డుపై రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. డ్రైనేజీ సమస్యకు వెంటనే పరిష్కారం చేపట్టి ప్రజల ఆరోగ్యం కాపాడాలంటూ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.