వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం- పోటెత్తిన భక్తులు - Simhadri Appanna Chandanotsavam

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 5:27 PM IST

thumbnail
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం- పోటెత్తిన భక్తులు (ETV Bharat)

Simhadri Appanna Chandanotsavam: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారికి చందనోత్సవం నిర్వహించారు. అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వామివారికి రెండో విడత చందనం సమర్పణ చేశారు. 125 కేజీల చందనాన్ని మూడు రోజులపాటు అరగదీసి స్వామివారికి సమర్పించారు. రాష్ట్ర నలుమూలల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దేవస్థానం అధికారులు వైశాఖ పౌర్ణమిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రతి ఏటా చందనోత్సవం జరిగిన తర్వాత వచ్చే వైశాఖ పౌర్ణమి నాడు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు సింహాచలం విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. దీనిలో భాగంగా నేడు భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తారు. ఆలయ అధికారులు అంతరాలయ దర్శనం నేడు నిలుపుదల చేశారు. నీలాద్రి గుమ్మం నుంచే భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులంతా వరాహ పుష్కరణలో పుణ్యస్నానాలు ఆచరించి, గరడీలతో స్వామివారిని కీర్తించుకున్నారు. చందనోత్సవం నేడు రద్దీని తలపించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.