LIVE : సికింద్రాబాద్ టు విశాఖ రెండో వందేభారత్ రైలు ప్రారంభోత్సవం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 9:28 AM IST

Updated : Mar 12, 2024, 10:04 AM IST

thumbnail

Second Vande Bharat Express Launch Live : సికింద్రాబాద్​-విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్​గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందేభారత్​ ఎక్స్​ప్రెస్​ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల మధ్య ఆరు రోజుల పాటు నడవనుంది. కేవలం గురువారం మాత్రమే ఈ వందేభారత్​ రైలు నడవదు. మిగిలిన అన్ని రోజులు ప్రయాణిస్తుంది. ఈ రైలు సాధారణ సేవలు వైజాగ్​-సికింద్రాబాద్​ వరకు మార్చి 13 నుంచి, సికింద్రాబాద్​ నుంచి విశాఖపట్నం వరకు మార్చి 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ రెండో వందేభారత్​ ఎక్స్​ప్రెస్​ టికెట్ల బుకింగ్స్​ మార్చి 12 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ వందేభారత్​ రైలు వరంగల్​, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగనుంది. ఈ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ ఏడు ఏసీ ఛైర్​ కార్​ కోచ్​లు, ఒక ఎగ్బిగ్యూటివ్​ ఏసీ ఛైర్​ కార్​ కోచ్​లతో ప్రయాణిస్తుంది. అన్ని బోగీలలో కలిపి మొత్తం 530 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. అదే విధంగా గుంటూరు డివిజన్‌ పరిధిలో రైల్వే ప్రాజెక్టులను సైతం వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు.  

Last Updated : Mar 12, 2024, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.