రాష్ట్రానికి విచ్చేయనున్న ప్రధాని మోదీ - జాతీయ రహదారిపై రన్ వేను పరిశీలించిన అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 11:04 AM IST

thumbnail

PM Modi Landing on Highway: బాపట్ల జిల్లా కొరిశపాడు వద్ద జాతీయ రహదారిపై అత్యవసర విమానాల ల్యాండింగ్ రన్ వేను అధికారులు పరిశీలించారు. ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బహిరంగ సభకు ప్రధాని హాజరవుతున్నారు. మోదీ విమానంలో గన్నవరంలో కాకుండా కొరిశపాడు జాతీయ రహదారి రన్ వేపై దిగే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. 

అందుకే జాతీయ రహదారుల సంస్థ పీడీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు రన్ వేను పరిశీలించారు. ప్రధాని భద్రతా దళం కూడా రన్ వేను ఆ మార్గాన్ని పరిశీలించిన తర్వాత ల్యాండింగ్ విషయాన్ని ఖరారు చేయనుంది. కొరిశపాడు నుంచి బొప్పూడి బహిరంగ సభా వేదిక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి హెలికాఫ్టర్​లో సభా వేదిక వద్దకు చేరుకోవచ్చు. అందుకే ప్రధాని విమానం దిగటంపై సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలించారు. ఇక్కడ విమానాల ల్యాండింగ్​కు సంబంధించి ట్రయల్ రన్ 2022 డిసెంబర్​లో జరిగింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.