నేటికీ అందని పింఛన్​ - కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వృద్ధుల అవస్థలు - Pensioners Problems in Vizianagaram

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 4:32 PM IST

thumbnail
నేటికీ అందని పింఛను - కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వృద్ధుల ఆపసోపాలు (ETV Bharat)

Pensioners Problems in Vizianagaram: ఒకటో తేదీకి అందించవలసిన పింఛన్​ నేటి వరకు ఇవ్వలేదంటూ విజయనగరంలో వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ ఖాతా పని చేయకపోవడంతో విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో ఖాతాను యాక్టివ్ చేయించుకున్నామన్నారు. అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవటంతో సచివాలయాలు, బ్యాంకులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నామని వృద్ధులు తమ గోడు వెలిబుచ్చారు. ఆరోగ్యం సహకరించక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

మందులు కొనుగోలు చేయడానికి అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. ఇలా తిరగడానికి రూ.రెండు వేలు ఖర్చు అయ్యిందని వాపోయారు. నడవలేని స్థితిలో ఉన్న కొందరు వృద్ధుల్ని వెంట పెట్టుకుని నగరపాలక కార్యాలయానికి తిరుగుతున్నామని సహాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనిపై అధికారులు మాట్లాడుతూ, వచ్చే నెల పదో తేదీ లోపు రెండు నెలల పింఛను అందిస్తామన్నారు. వృద్ధులు ఎవరూ సహనం కోల్పోకుండా ఉండాలని పేర్కొన్నారు. పింఛను జూన్ 10వ తేదీ లోపు ఇస్తామని అధికారులు చెప్తుండటంపై వృద్ధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.