శంషాబాద్​ విమానాశ్రయంలో మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా హెరాయిన్​ పట్టివేత - విలువ తెలిస్తే షాక్!

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2024, 9:33 PM IST

thumbnail

Officials Caught Heroin at Shamshabad Airport : హైదరాబాద్​లోని శంషాబాద్​ విమానాశ్రయంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా రోజురోజుకూ పెరుగుతోంది. గత కొద్దికాలంగా అక్రమంగా బంగారం, డ్రగ్స్​ తీసుకువెళ్తూ పలువురు నిందితులు పట్టుబడుతున్నారు. వీరిలో మహిళలు కూడా ఉంటున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఓ మహిళ హెరాయిన్​ తరలిస్తూ అధికారులకు చిక్కింది. కస్టమ్​ అధికారులు(Custam Officials Caught Drugs from SA Woman) తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణాఫ్రికా దేశానికి చెందిన మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.41 కోట్లు విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళ లుసాకా, జాంబియా దేశం నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసిన అధికారులు ఎన్​డీపీఎస్‌ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Bomb Threat Call to Hyderabad Airport : మరోవైపు శంషాబాద్​ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్​ వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం విమానాశ్రయానికి ఓ ఆగంతకుడు జీఎంఆర్ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసి బాంబు ఉందని బెదిరించాడు. వెంటనే ఆర్​జీఐ పోలీసులకు జీఎంఆర్​ సిబ్బంది సమాచారమిచ్చారు. అధికారులు వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టగా, ముంబయికి చెందిన వ్యక్తి ఫోన్​ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.