LIVE: విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో లోకేశ్​ "శంఖారావం" సభ ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 11:06 AM IST

Updated : Feb 19, 2024, 12:11 PM IST

thumbnail

Nara Lokesh Live: వైఎస్సార్​సీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి అరాచకపాలనను ప్రజల్లో ఎండగట్టేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ శంఖారావం యాత్ర చేపట్టారు. ప్రభుత్వం అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తూ లోకేశ్​ శంఖారావం యాత్రలో ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ క్రమంలో ఈ యాత్ర నేడు విశాఖ ఉత్తర, గాజువాక, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల్లో కొనసాగనుంది.  ఉదయం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో, మధ్యాహ్నం గాజువాక నియోజకవర్గంలో,  సాయంత్రం అనకాపల్లి నియోజకవర్గంలో, రాత్రి చోడవరం నియోజకవర్గంలో నిర్వహించనున్న శంఖారావం సభలో లోకేశ్​ పాల్గొననున్నారు. 

రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులమయం చేసిందన్న లోకేశ్, రెండు నెలలు ఓపిక పడితే టీడీపీ-జనసేన ప్రభుత్వం ఖాయమని అన్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక విశాఖను విషాదపట్నంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీ తీసుకొచ్చేవారని తెలిపారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రోజుకొక భూకుంభకోణం, హత్యలు, కిడ్నాప్‌లు తీసుకొస్తోందని ఎద్దేవా చేశారు. ఎవరన్నా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధించడం మొదలెట్టారని లోకేశ్ విమర్శించారు.

Last Updated : Feb 19, 2024, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.