LIVE: విశాఖ తూర్పు నియోజకవర్గంలో లోకేశ్ శంఖారావం యాత్ర ప్రత్యక్షప్రసారం
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 18, 2024, 11:34 AM IST
|Updated : Feb 18, 2024, 12:38 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-02-2024/640-480-20778938-thumbnail-16x9-lokesh-live.jpg)
Nara Lokesh Live: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అరాచకాలను, అవినీతిని ఎండగట్టేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన శంఖారావం యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్రకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. శంఖారావం యాత్ర ఆదివారం (నేడు) విశాఖలో జరగనుంది.
ఉదయం 10 గంటలకు విశాఖ తూర్పు నియోజకవర్గంలో లోకేశ్ శంఖారావం సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో శంఖారావం సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సభ నిర్వహించనుండగా లోకేశ్ ఈ సభల్లో పాల్గొననున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని లోకేశ్ పిలుపునిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆధీనంలో భూ అక్రమాలు, అవినీతి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కోంటోందని తాము అధికారంలోకి రాగానే ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామని అన్నారు.