LIVE: బొబ్బిలి శంఖారావం సభలో నారా లోకేశ్- ప్రత్యక్ష ప్రసారం
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 6:37 PM IST
|Updated : Feb 14, 2024, 7:15 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2024/640-480-20750766-thumbnail-16x9-nara-lokesh-shankaravam-at-bobbili-live.jpg)
Nara Lokesh Shankaravam at Bobbili Live: తొలి మూడు రోజుల కంటే రెట్టింపు ఉత్సాహంతో నారా లోకేశ్ శంఖారావం యాత్ర సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ లోకేశ్ యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బొబ్బిలి నియోజకవర్గంలో లోకేశ్ శంఖారావం యాత్ర కొనసాగుతోంది. అంతకుముందు సాలూరు నియోజకవర్గంలో లోకేశ్ శంఖారావం సభ నిర్వహించారు. ఈ యాత్రలో ఎన్నికల సన్నద్ధతపై పార్టీ క్యాడర్కు లోకేశ్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ కేడర్తో లోకేశ్ ముఖాముఖిలు నిర్వహిస్తూ, సూపర్ - 6 కిట్లను అందజేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ కేడర్తో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖులను చేయటంతో పాటు జగన్ పీడిత వర్గాలన్నింటికీ భరోసా కల్పించేలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. అధికార పార్టీ నేతల అరాచకాలను ఎండగడుతూ, తాము అధికారంలోకి రాగానే అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టిస్తామనేది వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బొబ్బిలి నియోజకవర్గంలో నారా లోకేశ్ శంఖారావం యాత్ర ప్రత్యక్ష ప్రసారం మీకోసం.