హుందాగా ఉండే ఏపీ రాజకీయం రౌడీ రాజ్యమైంది : నారా భువనేశ్వరి - Bhuvaneswari Nijam Gelavali Yatra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 8:04 PM IST

thumbnail

Nara Bhuvaneswari Nijam Gelavali Yatra in Nellore District :  'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా నెల్లూరు సర్వేపల్లి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. వెంకటాచలం మండలం పుంజలూరుపాడు గ్రామంలో ఆరణి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ (Arrest) అయినప్పుడు నారాయణ రెడ్డి (54) తీవ్ర ఒత్తిడికి గురై గుండె పోటుతో మృతి చెందాడు. ఈ సందర్బంగా వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు.

ఈ సందర్బంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని 53 రోజులు అరెస్టు చేశారు. ఆ సమయంలో 203 మంది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు. తెలుగుదేశం పార్టీ నిలబడాలని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయమంటే హుందాగా గర్వంగా ఉండేది, ఇప్పుడు రౌడీ రాజ్యం పరిపాలిస్తోంది. చంద్రబాబు నాయుడు జీవితాన్ని కార్యకర్తలకు అంకితం చేశారు అని అన్నారు. లీడర్ ఏవిధంగా వుంటే కార్యకర్తలు ఆవిధంగా ఉంటారని వైఎస్సార్సీపీ (YSRCP) పాలనలో జరుగుతున్న అరాచకాలపై మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.