ఓటును అమ్ముకుంటే భవిష్యత్‌ను అమ్ముకున్నట్లే- మంగళగిరిలో ఇళ్ల ఎదుట ఫ్లెక్సీలు - Vote Awareness

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 3:12 PM IST

thumbnail
ఓటును అమ్ముకుంటే భవిష్యత్‌ను అమ్ముకున్నట్లే- మంగళగిరిలో ఇళ్ల ఎదుట ఫ్లెక్సీలు (ETV Bharat)

MY Vote Not for Sale Mangalagiri in Guntur District : ఓటును అమ్ముకుంటే భవిష్యత్ ను అమ్ముకున్నట్లే అంటూ కొందరూ వినూత్న ప్రచారం నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళిగిరికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి గోలి మధు, చేనేత కార్మికుడు రేఖా కృష్ణార్జునరావు ఓట్లు అమ్మకోబోమని వారి ఇంటి బయట ఫ్లెక్సీలు పెట్టారు. ఓటుకు డబ్బులు ఇచ్చే అభ్యర్థులు తమ గుమ్మం తొక్కవద్దని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 

ఓటరును చైతన్యవంతం చేయడం ఎలా అనే అంశంపై వివిధ కోణాల్లో కవిత్వాలు రాశానని గోలి మధు తెలియజేశారు. వర్తమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రతి మనిషి నిజాయతీగా వ్యవహరిస్తే శక్తి వంతమైన ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి చైతన్యం ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకున్నారు. ఓటును అమ్ముకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోతామని తెలిపారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా, స్వాతంత్య్రంగా వినియోగించుకోవాలని రేఖా కృష్ణార్జునరావు వెల్లడించారు. ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.