సీఎం జగన్​పై పారిశ్రామికవేత్తల మండిపాటు- బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 1:13 PM IST

thumbnail

MSME SCST Entrepreneurs Fire on CM Jagan: బడుగు వికాసం ప్రోత్సాహక బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎమ్​ఎస్​ఎమ్ఈ (సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమలు) ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు డిమాండ్‌ చేశారు. ఎంఎస్​ఎంఈ సంస్థ ద్వారా రుణాలు తీసుకుని పరిశ్రమలు నెలకొల్పిన ఎస్సీ ఎస్టీలకు సీఎం జగన్‌ బకాయిలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మ్​ఎస్​ఎమ్ఈ ఎస్సీఎస్టీ పారిశ్రామికవేత్తలు విజయవాడలో సమావేశం నిర్వహించారు. మూడేళ్లుగా ప్రోత్సాహకాలు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 సంక్షేమ పథకాలను జగన్‌ ప్రభుత్వం నిలిపివేసిందన్న పారిశ్రామికవేత్తలు బడుగు వికాసం ప్రోత్సాహకాలను విడుదల చేయని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

"సీఎం జగన్‌ నిలిపివేసిన బడుగు వికాసం ప్రోత్సాహక బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. మూడేళ్లుగా ప్రోత్సాహకాలు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు చెందిన 27 సంక్షేమ పథకాలను జగన్‌ ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు బడుగు వికాసం ప్రోత్సాహకాలను విడుదల చేయని పక్షంలో ఆందోళన చేస్తాం." - ఎమ్​ఎస్​ఎమ్ఈ ఎస్సీఎస్టీ పారిశ్రామికవేత్తలు 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.