ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది : మోత్కుపల్లి నర్సింహులు - Motkupalli on CM Revanth
Published : May 11, 2024, 3:54 PM IST
Motkupalli Narasimhulu Fire on CM Revanth Reddy : లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్తో తనకు ప్రాణహాని ఉందని మోత్కుపల్లి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు సీట్లు కేటాయించలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి మాదిగలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు.
Motkupalli Narasimhulu about Dalits : మాదిగలను అణచివేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మోత్కుపల్లి ఆరోపించారు. ఆ పార్టీ తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలు ఒక బోగస్ అని అన్నారు. మాదిగల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని, కేవలం వారిని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 లక్షల మంది ఉన్న మాదిగలకు ఒక సీటు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సీట్లు అమ్ముకుని మాదిగలను అవమాన పరిచిందని ఆరోపణలు గుప్పించారు. గత ప్రభుత్వ పాలన నచ్చక మాదిగలు మొత్తం రేవంత్ను గెలిపించారని చెప్పారు.