గుడ్లూరు ఎస్సై వేధింపులు - వ్యక్తి ఆత్యహత్య - స్టేషన్​ ఎదుట బంధువుల ఆందోళన - Market Committee Employee Suicide

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 3:37 PM IST

thumbnail

Market Committee Employee Suicide due to Gudluru SI Harassment : ఎస్సై అనవసరంగా కొట్టడాన్ని మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుడ్లూరు మండలం గుళ్లపాలెంలో సురేష్​ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుడ్లూరు వ్యవసాయ మార్కెట్​ కమిటీలో విధులు నిర్వహిస్తున్న సురేష్​పై ఎస్సై లక్ష్మణ్​ చేయి చేసుకున్నారు. బియ్యం లారీల గురించి చెప్పాలని గత కొంత కాలంగా ఎస్సై వేధిస్తున్నారని సురేష్​ తన సూసైడ్​ లేఖలో పేర్కొన్నారు.

సురేష్​ను పోలీస్​ స్టేషన్​లో నిర్బంధించి తన ద్వి చక్ర వాహనం, ఫోన్​ను ఎస్సై లక్ష్మణ్​ వద్ద పెట్టుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మనస్థాపంతో సురేష్​ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. గుడ్లురు పోలీస్ స్టేషన్ ముందు సురేష్​ మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. ఎస్​ఐ లక్ష్మణ రావు అతి ప్రవర్తనతో నిండు ప్రాణం పోయిందని బాదితులు ఆందోళన చేస్తున్నారు. ఎస్​ఐ పై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్​ చేశారు. స్టేషన్​లో ఎస్​ఐ లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.