LIVE : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 5:46 PM IST

Updated : Feb 3, 2024, 6:05 PM IST

thumbnail

BJP State Chief Kishan Reddy LIVE : హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మాదిరి మాయమాటలు చెప్పకుండా, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాసేవలో తమ పనితనం చూపించాలని కోరారు. మాయమాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించి గులాబీ పార్టీ ఫామ్​హౌస్​కే పరిమితమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాయమాటలు చెప్పకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్​ నగర్​, బోరబండ, మధురానగర్​ డివిజన్​లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వం కారణంగా నగరంలోని బస్తీలు అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నాయకులు లోక్​సభ ఎన్నికలపై కార్యాచరణ చేపట్టారు. పార్టీ చేరికలపై దృష్టి సారిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లు గెలిచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదంటూ జోస్యం చెప్పారు.

Last Updated : Feb 3, 2024, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.