న్యాయం కోసం వెళ్తే సీఐ వేధిస్తున్నారు - చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి ఆవేదన - Land Issue CI Harassment
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2024, 6:05 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-05-2024/640-480-21557519-thumbnail-16x9-land-issue-ci-harassment.jpg)
Land Issue Complaint on CI Harassment: తనకు న్యాయం చేయాలంటూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి అనంతపురం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. భూ వివాదంలో న్యాయం చేయాల్సిన పోలీసులే తనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని ఐటీఐ కళాశాల వద్ద ఉన్న ఎకరం భూమి తన పేరుపై ఉందని, ఆ భూమిని కళాశాల యజమాన్యం ఆక్రమించిందని బాధితుడు ఆరోపించాడు.
తమ వద్ద భూమికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నప్పటికీ సీఐ జాకీర్ హుస్సేన్ తమపై తప్పుడు కేసులు పెట్టారని బాధితుడు తెలిపారు. భూమికి చెందిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్లో ఒక రోజంతా ఉంచి సీఐ ఇబ్బందులు పెట్టారని చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు దీనిపై ప్రత్యేక చొరవ తీసుకొని తమ పైన ఉన్న కేసులు కొట్టివేసి, తమ భూ వివాదాన్ని పరిష్కరించాలని జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందించారు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.