కలిసికట్టుగా పని చేద్దాం - టీడీపీ-జనసేనను గెలిపిద్దాం: నాగబాబు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 5:40 PM IST

thumbnail

Konidela Nagababu Meeting in Pendurthi: కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల్లో టీడీపీ, జనసేనను గెలిపించాలని  జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు, బూత్​ స్థాయి నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగబాబు ( Konidela Nagababu ) హాజరయ్యారు. 

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల్లో టీడీపీ, జనసేనను గెలిపించాలని సూచించారు. పార్టీలో అంతర్గతంగా ఏవైనా సమస్యలు ఉంటే మనమే చర్చించుకుందామని, బయటకు వచ్చి రచ్చ చేయొద్దని కార్యకర్తలకు హితవు పలికారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజక వర్గ ఇన్చార్జ్ పంచకర్ల రమేష్ బాబు, అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. సీట్ల విషయంపై పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నాగబాబు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయటానికి ప్రయత్నిస్తామని నాగబాబు పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.