కడపను స్మార్ట్‌ సిటీగా మారుస్తా - కడప-బెంగళూరు రైల్వే లైను పూర్తి చేస్తా : భూపేశ్‌ రెడ్డి - Kadapa TDP MP Candidate Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 1:41 PM IST

thumbnail

Kadapa TDP MP Candidate Bhupesh Reddy Interview : వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప పార్లమెంటును ఈసారి తప్పకుండా కైవసం చేసుకుంటామని తెలుగుదేశం పార్టీ కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మూడున్నర దశాబ్ధాలుగా వైఎస్ కుటుంబ సభ్యులే కడప ఎంపీలుగా ఉన్నా జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. కనీసం కడప స్టీల్ ప్లాంట్​ను కూడా పూర్తి చేయలేక పోయారని నిప్పులు చెరిగారు. జగన్ చేసిన ఐదేళ్ల పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయడు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. 

కడపను స్మార్ట్‌ సిటీగా మారుస్తామని అక్కడి ప్రజలకు భూపేశ్‌ రెడ్డి హామీ ఇచ్చారు. కడప-బెంగళూరు రైల్వే లైను పూర్తి చేస్తామని తెలిపారు. కుటుంబ వివాదాలతో పరువును రచ్చ కీడుస్తున్న వైఎస్ కుటుంబ సభ్యుల మాటలను జిల్లా ప్రజలు ఛీదరించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన భూపేష్ రెడ్డి పార్లమెంటు పరిధిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఈటీవీ భారత్ ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.