అభివృద్ధే లక్ష్యం- ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా: లోకం మాధవి - jsp MLA Candidate Lokam Madavi
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2024, 1:20 PM IST
Janasena MLA Candidate Lokam Madavi interview: ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ ప్రాంతంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి అన్నారు. ప్రజల సమస్యలను తీర్చడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతామని అంటున్నారు. ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న లోకం మాధవితో మా ఈటీవీ భారత్ ప్రతినిధి ఓబిలేసు ముఖాముఖి.
"ఐదేళ్లుగా జగన్ సర్కారు మా ప్రాంతంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదు. స్థానిక ఎమ్మెల్యే భూ దందాలు, అక్రమాలు తప్పు ఏమీ చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. ప్రజల సమస్యలను తీర్చడమే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తాం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. రైతులకు సాగునీరు అందించడానికి అన్ని విధాల కృషి చేస్తాం." - లోకం మాధవి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి