ఫ్యాన్​ రెక్కలు విరిచి - కింద పడేసి జనసేన వినూత్న ప్రచారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 12:47 PM IST

thumbnail

Janasena Leaders Warning to YSRCP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నేతలు వినూత్న ప్రచారం చేపట్టారు. ఫ్యాన్ రెక్కలు తొలగించి కింద పడేస్తూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఇదే గతి పడుతుందని జనసేన నేతలు హెచ్చరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్​ఛార్జి వినుత పార్టీ తరపున ప్రచారంలో (Campaign) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వినుత ఫ్యాన్ రెక్కలను వంచి ప్రచార రథం (campaign vehicle) నుంచి కిందకు పడేసి వైఎస్సార్సీపీ నేతలపై ధ్వజమెత్తారు. 

Srikalahasti Constituency Janasena Incharge Vinuta Campaign: జనసేన పార్టీ గుర్తుని (Janasena Party symbol) హేళన చేస్తూ ఇటీవల వైఎస్సార్సీపీ నేతలు ప్రచారం చేయడంపై వినుత మండిపడ్డారు. గాజు గ్లాసును కడిగి మరలా వినియోగించుకోవచ్చని అదే ఫ్యాన్ విరిగితే మళ్లీ ఉపయోగించలేమని జనసేన నేతలు విమర్శించారు (Criticize). వైఎస్సార్సీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వినుత హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.