రాష్ట్రవ్యాప్తంగా రూ.4 లక్షల పైగా విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం - Illegal Liquor Bottles

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 10:33 AM IST

thumbnail
రాష్ట్రవ్యాప్తంగా రూ.4 లక్షల పైగా విలువైన మద్యం బాటిళ్లులను స్వాధీనం చేసుకున్న పోలీసులు (ETV Bharat)

Illegal Liquor Bottles Police Seized in AP : ఎన్నికల వేళ రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 4 లక్షల రూపాయలకు పైగా విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నుంచి 1056 మద్యం సీసాలను కొనుగోలు చేసి తరలిస్తుండగా పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. వీరాపురానికి చెందిన వైఎస్సార్సీపీ సర్పంచ్‌ వాహనం తనిఖీ చేయగా మద్యం సీసాలు కనిపించాయి. వాహనం సీజ్‌ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరులో 4 ద్విచక్రవాహనాలపై 50 బాక్సుల కర్ణాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పల్లంపల్లిలో 908 తెలంగాణ మద్యం బాటిళ్లను ఆటోలో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి 100 మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి నందిగామలో స్కూటిలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.