ఇళ్లు, పట్టాలు ఇచ్చేశామని వైసీపీ నేతల ఫేక్ పబ్లిసిటీ- ఎక్కడ ఇచ్చారో చూపాలని మహిళల ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 12:33 PM IST

thumbnail

Flexi Issue in Eluru District :  జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా, నిర్మాణాలు పూర్తిచేయకుండా పూర్తి చేసినట్టు వైఎస్సార్సీపీ నేతలు లబ్దిదారుల పేరిట ఏర్పాటు  చేసిన ఫ్లెక్సీలు, కరపత్రాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇళ్ల స్థలాలే ఇవ్వకుండా ఎలా ఇచ్చామని చెబుతారంటూ ఏలూరు జిల్లా కైకలూరు మండలం నత్తగుళ్లపాడు గ్రామస్థులు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (MLA) నాగేశ్వరావు మాటలు నమ్మి మోసపోయామని వాపోయారు. ఇంటి స్థలాలు ఎక్కడ కేటాయించారో ఇంటి నిర్మాణం ఎక్కడ చేశారో చెప్పాలంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన గ్రామస్థులు ఆదివారం గ్రామంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే, తహసీల్దార్, వీఆర్వో మాటలు నమ్మి మోసపోయాం సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. 42 మంది లబ్ధిదారులకు సంబంధించిన ఇళ్ల పట్టాలు కైకలూరు రెవెన్యూ కార్యాలయంలో ఉన్నాయని కలెక్టర్ (Collector) స్పందించి తమ పట్టాలు ఇప్పించి గ్రామంలో ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.