హన్మకొండ జిల్లాలో దారుణం- పత్తిపంటను రక్షించబోయి మహిళ దగ్ధం
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Feb 9, 2024, 3:34 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2024/640-480-20708456-thumbnail-16x9-fire-accident.jpg)
Fire Accident in Hanmakonda : హన్మకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిలువచేసిన పత్తి దిగుబడిని కాపాడుకోబోయి ఓ మహిళ సజీవ దహనమయ్యింది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంకు చెందిన తొడేటి సౌందర్య(56) అనే మహిళ మంటలను ఆర్పాలని ప్రయత్నించబోయి సజీవ దహనమైంది. వీరిది వ్యవసాయాధారిత కుటుంబం. గత వానకాలం సీజన్లో పత్తి పంటను సాగు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవటంతో వచ్చిన పత్తి దిగుబడికి ఇంట్లో నిలువ చేశారు. ప్రమాదవశాత్తు ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో పత్తికి మంటలు వ్యాపించాయి.
అగ్నిప్రమాదాన్ని గుర్తించిన సదరు మహిళ మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో పత్తి సంచులు ఆమె మీద పడి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో ఆమె అక్కడికక్కడే సజీవ దహనమయ్యింది. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ మంటల్లో సౌందరయ్య సజీవ దహనమయ్యింది. మృతురాలి కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి