కోల్డ్​ స్టోరేజ్​లో మంటలు - అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 4:51 PM IST

thumbnail

Electric Shock in Shubham Maheshwari Cold Storage in Duggirala : గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్​ స్టోరేజ్​లో విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. గోదాం తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నించారు. గోదాము లోపలకు వెళ్లే అవకాశం మంటల నియంత్రణ కష్టంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. మంటలు ఆర్పేందుకు యత్నించిన ఏడుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని జాయింట్​ కలెక్టర్​ రాజకుమారి పరిశీలించారు. మంటల తీవ్రత ఉద్ధృతంగా ఉండటంతో చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించామని తెలిపారు. ఏ క్షణములోనైనా గిడ్డింగి కూలి పోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ సంఘటనలో మొత్తం 11 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు.

మంగళగిరి, తెనాలి, విజయవాడ నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాలు మంటలు అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో లక్షల విలువైన పసుపు, మినుముల బస్తాలు అగ్నికి ఆహుతి అయ్యాయన్నారు. సుమారు 60 నుంచి 70 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.