పింఛన్‌ పంపిణీ ఆలస్యానికి వైసీపీ ప్రభుత్వమే భాధ్యత వహించాలి: రామకృష్ణ - CPI Ramakrishna on Pension Issue

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 2:45 PM IST

thumbnail

CPI Ramakrishna on Pension Distribution Issue: పింఛన్‌ పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్, అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. పెన్షన్ పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు లక్షా 25 వేల మంది సచివాలయ సిబ్బంది ఉండగా 66 లక్షల మందికి పెన్షన్లు సకాలంలో ఎందుకివ్వలేరని ప్రశ్నించారు. వైసీపీ కుట్రపూరితంగానే ఇంటింటికి పంపిణీ చేయడం లేదని విమర్శించారు. 

"పింఛన్‌ పంపిణీ ఆలస్యానికి జగన్ ప్రభుత్వమే భాధ్యత వహించాలి. పంపిణీకి వాలంటీర్లను వినియోగించొద్దని మాత్రమే ఈసీ చెప్పింది. సచివాలయ సిబ్బందితో వెంటనే పింఛన్‌ పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ కుట్రపూరితంగానే పెన్షన్​ ఇంటింటికి పంపిణీ చేయడం లేదు." - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి 

కాగా పెన్షన్ల పంపిణీ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నేతలు ఆందోళన చేపట్టాయి. సెర్ప్ జారీ చేసిన సర్క్యులర్​ అధికార పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై సెర్ప్ జారీ చేసిన సర్క్యులర్​కు వ్యతిరేకంగా తమ గళం విప్పుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.