LIVE : కొత్తగా 100 బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్​ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 3:28 PM IST

Updated : Feb 10, 2024, 4:09 PM IST

thumbnail

CM Revanth Reddy Launched 100 TSRTC New Buses Live : టీఎస్​ఆర్టీసీకి అందుబాటులో మరో 100 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మహాలక్ష్మీ పథకం కోసం 90 ఎక్స్​ప్రెస్​ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. హైదరాబాద్​- శ్రీశైలం మార్గంలో తొలిసారి 10 ఏసీ రాజధాని సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఆర్టీసీల బస్సులను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్​, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు​ పాల్గొన్నారు. ఇప్పటికే 1000 కొత్త ఆర్టీసీలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం ఏర్పడిన మొదటిలో కొన్ని బస్సులను ప్రారంభించగా, ఇప్పుడు మరో 100 బస్సులను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. దీంతో మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణంలో బస్సులు సరిపోక ఎన్నో ఇబ్బందులను పడుతున్నారు. ఈ క్రమంలో మరో 100 బస్సుల రాకతో ప్రయాణం మరింత సౌకర్యంగా సాగనుంది.

Last Updated : Feb 10, 2024, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.