పొలంలో పైపులైన్‌ విషయంలో ఘర్షణ - ఇరువర్గాల దాడి - Clash Between Two Groups

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 5:18 PM IST

thumbnail
పొలంలో పైపులైన్‌ విషయంలో ఘర్షణ - ఇరువర్గాల దాడి (ETV Bharat)

Clash Between Two Groups for Pipeline in Kurnool District : పొలంలోని పైపులైన్ కోసం రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొంద మందికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం గుడెకల్ అనే గ్రామం​లో ఓ వ్యక్తికి సంబంధించిన పొలంలో సాగు నీటి పైపు లైన్ కోసం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఐదుగురు గాయపడ్డారు. 

ఇరువర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి (Emmiganoor Govt Hospital) తరలించారు. స్థానిక పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కేసు నమోదు చేసి ఆ ఘర్షణకు గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.