LIVE : ఎల్​ఆర్ఎస్​పై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నా

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 10:27 AM IST

Updated : Mar 6, 2024, 10:34 AM IST

thumbnail

BRS Protest against LRS in Telangana : లే అవుట్ల క్రమబద్ధీకరణ-ఎల్ఆర్ఎస్ (LRS)ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ రాష్ట్ర సమితి ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కాంగ్రెస్ నేతలు గతంలో చెప్పినట్లుగా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్​ఆర్​ఎస్​ చేయాలని బీఆర్​ఎస్​ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్​ఆర్​ఎస్​ చేస్తామన్న వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇపుడు చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసనలకు గులాబీ పార్టీ పిలుపునిచ్చింది.  BRS Dharna on LRS in Telangana : అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కార్యాలయాల వద్ద బీఆర్​ఎస్​ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నిరసనల్లో పాల్గొంటున్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని గులాబీ పార్టీ ఆరోపించింది. ఎన్నికల్లో గెలవడానికి అడ్డమైన హామీలు ఇచ్చి, ఆ పార్టీ ప్రజలను గందరగోళం చేసిందని విమర్శించింది.

Last Updated : Mar 6, 2024, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.