ఎన్నికల ప్రచారంలోకి ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర- సత్యసాయి జిల్లాలో పర్యటన - Vasundhara at election campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 6:48 PM IST

thumbnail

Vasundhara participated in election campaign: ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీ నేతలతో పాటు, వారి కుటుంబసభ్యులు సైతం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేడు మూడవరోజు ఎన్నికల ప్రచారంలోన్న ఆమె ఇంటింటా తిరుగుతూ సూపర్‌ సిక్స్ కరపత్రాలను ప్రజలకు పంచారు. వెంకటాపురంలో మహిళల కూలీలతో కలిసి, రాగి పనలను కోశారు. ముఖ్యంగా ఆయా గ్రామాల్లోని  మహిళా ఓటర్లను కలుసుకొని బాలకృష్ణ ను మూడోసారి గెలిపించాలని కోరారు. వసుంధర ప్రచారంలో పాల్గొన్న మహిళలు పాటలతో ఆమెను ఉత్సాహపరిచారు.    వసుంధర సమక్షంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు.  ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపింపిస్తే, హిందూపురం మరింత అభివృద్ధి దిశగా వెళ్తుందని మహిళా ఓటర్లకు సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు పెద్ద పీట వేస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాలలో సైతం మహిళాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.   

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.