'మేనిఫేస్టోలో సర్పంచ్​ల సమస్యలు పరిష్కరిస్తామని ఉంటేనే ఓటేస్తాం' - Panchayat Raj Chamber President YVB

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 5:40 PM IST

thumbnail
()

AP Panchayat Raj Chamber President YVB Rajendra Prasad on Elections : రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా సర్పంచ్​లు పని చేస్తారని ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి అటూ సర్పంచ్​లను ఇటూ ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. సర్పంచ్​ల సమస్యలు పరిష్కరిస్తామని ఏ పార్టీ అయితే మేనిఫేస్టోలో పెడుతుందో వారికే సర్పంచ్​ల పూర్తి మద్దతు ఉంటుందని పెర్కొన్నారు. 

గ్రామీణ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని మూడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ఐదేళ్లుగా పంచాయతీరాజ్​ వ్యవస్థ నిర్వీర్యమవుతున్నా అధికార వైఎస్సార్సీపీ పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. గ్రామ పంచాయతీల సమస్యలు పట్టించుకోని జగన్​ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సీఎం జగన్ సర్పంచ్​లపై కపట ప్రేమ చూపిస్తున్నారని అంటున్న రాజేంద్ర ప్రసాద్​తో ఈటీవీ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి 

 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.