ETV Bharat / state

'సూపర్​ సిక్స్' పథకాల ఆకర్షణ - పార్టీని వీడుతున్న వైసీపీ శ్రేణులు - YSRCP Leaders Join in TDP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 3:50 PM IST

YSRCP Leaders Join in TDP : ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి వలసల భయం వెంటాడుతోంది. నిన్న, మొన్నటి వరకు వైసీపీలో కొనసాగించిన వారందరూ ఒక్కొక్కరుగా టీడీపీ గూటికి చేరుతున్నారు.

tdp_joinings
tdp_joinings

'సూపర్​ సిక్స్' పథకాల ఆకర్షణ - పార్టీని వీడుతున్న వైసీపీ శ్రేణులు

YSRCP Leaders Join in TDP : ఎన్నికలు సమీపించే కొద్ది రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. అయిదేళ్లలో అధికార పార్టీ చేసిన అరాచకాలు భరించలేక వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు కూటమిలోకి చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమితోనే సాధ్యమని భావించి వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.

NTR District : ఎన్టీఆర్​ జిల్లా నందిగామ బీసీ కాలనీకి చెందిన 30 కుటుంబాలు కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు తమను ఆకర్షించాయని, అందుకే వైసీపీని వీడి టీడీపీలోకి చేరామని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బాబు సూపర్​ సిక్స్​ పథకాలను ప్రజలకు వివరిస్తూ తిరువూరు పట్టణంలో కూటమి అభ్యర్థి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే సైకిల్​ గుర్తుకు ఓట్లు వేయాలని ఓటర్లుకు విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల దగ్గరపడుతున్న కొద్ది జోరుగా తెలుగుదేశంలోకి వైసీపీ నేతల చేరికలు - TDP To YCP

Anantapuram District : అనంతపురం జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. నిత్యం అర్బన్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్నారు. ఇవాళ హరిజన కాలనీకి చెందిన 50 కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ చేస్తున్న అరాచకాలు నచ్చకనే వీరందరూ అధికార పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారని వెంకటేశ్వర ప్రసాద్‌ అన్నారు. కూటమి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రేణులను కోరారు. కళ్యాణదుర్గంలో 105 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. వారికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

Vijayawada : ఒక్క ఛాన్స్​ ఇవ్వండి అంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగిన సీఎం జగన్​ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మాజీ ఛైర్​పర్సన్​ గద్దె అనురాధ అన్నారు. విజయనగర్​ తూర్పు మూడో డివిజన్​లో ఆమె ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలపించాలని ఓటర్లును కోరుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్​ ఎన్నికల ప్రచార జోరును పెంచారు. రైతులు, మహిళలు, యువతను పలకరిస్తూ సైకిల్​ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లును అభ్యర్థించారు.

టీడీపీలోకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు - Joinings In Tdp

YSR District : వైఎస్సార్​ జిల్లాలో అధికార పార్టీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కమలాపురం నియోజకవర్గంలో సూపర్​ సిక్స్​ పథకాలకు ఆకర్షితులైన 120 కుటుంబాలు పుత్త నరసింహారెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

Vizianagaram District : విజయనగరం జిల్లాలో అధికార పార్టీని వీడి టీడీపీలోకి వలసల జోరు పెరిగింది. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్​ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. సంతకవిటి మండలం సురవరం గ్రామ మాజీ సర్పంచ్​ సదాశివంతో పాటు 50 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. ఈ నేపథ్యంలోనే రాజాం పట్టణానికి చెందిన నాయి బ్రాహ్మణ కుటుంబాలు, వంగర మండలంకు చెందిన 20 ఎస్సీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి.

'అమరావతిని బతికించుకోవాలంటే టీడీపీని గెలిపించుకోవాలి' ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు - Alliance Leaders Election Campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.