ETV Bharat / state

టీడీపీలో మెుదలైన జోష్- వైఎస్సార్సీపీ నుంచి భారీగా వలసలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 7:47 PM IST

YSRCP Leaders Join in TDP : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. వైసీపీ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా టీడీపీలోకి క్యూ కడుతున్నారు. దీంతో పార్టీలో జోష్ మెుదలైంది. త్వరలోనే వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడీ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి పట్టం కట్టేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

YSRCP_Leaders_Join_in_TDP
YSRCP_Leaders_Join_in_TDP

YSRCP Leaders Join in TDP : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది తెలుగుదేశం పార్టీలో జోష్ మెుదలైంది. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు భరించలేక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు టీడీపీలోకి చేరడానికి క్యూ కడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా వంగర మండలం శివ్వాం గ్రామంలోని 300 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంత మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్​ఛార్జి కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. అలాగే వంగరం మండలంలోని ఓని అగ్రహారం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు సైతం టీడీపీలోకి చేరారు.

టీడీపీలో మెుదలైన జోష్- వైఎస్సార్సీపీ నుంచి భారీగా వలసలు

వైఎస్సార్సీపీకి పలువురు నాయకులు గుడ్​ బై - టీడీపీలోకి భారీగా చేరికలు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అభివృద్ది పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారని తెలిపారు. చంద్రబాబు పోలవరాన్ని 70 శాతం పూర్తిచేస్తే, ప్రభుత్వం మారిన తరువాత జగన్ మోహన్ రెడ్డి 10 శాతం పనులు కూడా పనులు పూర్తి చేయలేదని మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలనలో అక్రమలు, భూ కబ్జాలు ఇసుక దోపిడీలు తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ,టీడీపీ, జనసేన కూటమికి పట్టం కట్టేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

YCP Leaders Huge Joinings To TDP : తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన కౌన్సిలర్ షేక్ అమ్రిన్, పురపాలక సంఘం వైఎస్ ఛైర్మన్ షేక్ రఫీ ఆధ్వర్యంలో ఈరోజు 200 మంది పైగా యువకులు, మహిళలు తెలుగు దేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వాలంటీర్లు ఓటర్లను భయభ్రంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎవరికి భయపడకుండా నిర్భయంగా టీడీపీకి ఓటు వేయాలని కోరారు. మీకు మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సీఎం సొంత ఇలాకాలో వైఎస్సార్సీపీకి షాక్​ - టీడీపీలో చేరిన 200 కుటుంబాలు

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలంలో పలు కుటుంబాలు వైసీపీని వీడి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు కప్పి రఘునాథ్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం చేతకాని పాలన నచ్చాక టీడీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో వేలాది మంది వైసీపీని వీడి టీడీపీలోని చేరుతారని తెలిపారు. పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రామన్నపాలెం, వెంకటాపురం గ్రామాలకు చెందిన సుమారు 60 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోని చేరాయి. వీరందరిని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

'సూపర్ సిక్స్' ఎఫెక్ట్ టీడీపీలోకి భారీగా చేరికలు - సీఎం సొంత జిల్లాలో వైసీపీకి భారీ షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.