ETV Bharat / state

ఎన్నికల ముంగిట సైకిల్ జోరు - టీడీపీలోకి చేరేందుకు సిద్ధమైన వైసీపీ నేతలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 10:37 PM IST

YSRCP Key Leaders Joining TDP: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా టీడీపీలోకి వస్తున్నారు. ఇప్పటికే ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ సైతం సైకిల్ ఎక్కనున్నారు.

YSRCP_Key_Leaders_Joining_TDP
YSRCP_Key_Leaders_Joining_TDP

YSRCP Key Leaders Joining TDP: త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. అయితే అంతకుముందే అధికార వైసీపీకి వరుస షాక్​లు తగులుతున్నాయి. అధికార పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వైసీపీ అధిష్ఠానం ఉంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ (Vasantha Venkata Krishna Prasad) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు హైదరాబాదుకు బయలుదేరి వెళ్లారు.

ముందుగా నందిగామ మండలం అంబర్​పేటలోని శ్రీ సత్యమ్మ అమ్మవారి దేవాలయంలో సతీమణి శిరీషతో కలిసి ఎమ్మెల్యే వసంత ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి మైలవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు వసంత నివాసానికి పోటెత్తారు. వారందరితో ఉదయం నుంచి మాట్లాడారు. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఆయన స్వగ్రామం ఐతవరం నుంచి హైదరాబాద్​కు బయలుదేరారు. ఆయన తండ్రి మాజీ హోం శాఖ మంత్రి వసంత నాగేశ్వర ఆశీస్సులు తీసుకొని బయలుదేరి వెళ్లారు.

ఎన్నికల కన్నా ముందే నెల్లూరులో వైసీపీ ఖాళీ !

శనివారం ఉదయం 9 గంటలకు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. ఈ ఉద్దేశంతోనే తాను వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నట్లు చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నడుచుకుంటానని వసంత చెప్పారు. తాను ఎక్కడ పోటీ చేసే విషయం కూడా చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. వసంత వెంట వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీపీలు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.

చంద్రబాబు, లోకేశ్​ను తిడితేనే పదవులా?- రాష్ట్రాభివృద్ధి బాబుతోనే సాధ్యం: ఎమ్మెల్యే వసంత

ఇప్పటికే మరికొందరు సిద్ధం: అయితే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కంటే ముందే పలువురు వైసీపీ నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధం అయ్యారు. నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) శనివారంలో టీడీపీ చేరనున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో శనివారం జరిగే రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు కృష్ణదేవరాయలు ప్రకటించారు. పల్నాడు అభివృద్ధి కోసం ప్రజలకు తనకు మద్దతివ్వాలని కోరారు. మరోసారి నరసరావుపేట పార్లమెంటు నుంచి పోటీ చేస్తానని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) సైతం 2వ తేదీన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే నెల్లూరు జిల్లా వరికుంటపాడులో వైసీపీకి పలువురు నేతలు రాజీనామా చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో వారంతా టీడీపీ చేరుతున్నట్లు ప్రకటించారు.

భారీగా ఏర్పాట్లు: పల్నాడు జిల్లాలో జరిగే 'రా కదలిరా' సభలో పలువురు వైసీపీ నేతలు టీడీపీలోకి చేరేందుకు సిద్ధమైన తరుణంలో, ఈ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు పరిధిలో గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని నార్కట్​పల్లి - అద్దంకి హైవే రోడ్డు ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో "రా కదలిరా" సభ జరగబోతోంది.

నెల్లూరులో వైసీపీ నేతలే లేరు - అన్ని స్థానాలు టీడీపీ గెలుస్తుంది: మాజీ మంత్రి నారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.