ETV Bharat / state

పావలా పెట్టుబడికి రూపాయి ప్రోత్సాహకాలా?- ఆ సంస్థపై జగన్​ సర్కార్​కు ఎంత ప్రేమో! - GOVT INCENTIVE FOR INDOSOL

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2024, 7:44 AM IST

YSRCP Govt More Incentive for Indosol Company : ఇండోసోల్​ సోలార్​ కార్పొరేషన్​కు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంది. ఇండోసోల్​ సంస్థ పెట్టే పెట్టుబడికి రెట్టింపు ప్రయోజనాన్ని కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. భవిష్యత్తు అవసరాన్ని తీర్చేందుకూ కూడా అధికార ప్రభుత్వం అంగీకరించింది.

indosol_company
indosol_company (ETV Bharat)

YSRCP Govt More Incentive for Indosol Company : ‘పావలా కోడికి.. ముప్పావలా మసాలా ’ అనే సామెత షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల విషయంలో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఇండోసోల్​ సంస్థ పెట్టే పెట్టుబడికి రెట్టింపు ప్రయోజనాల్ని కల్పించేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. భవిష్యత్తులోనూ ఏవైనా రాయితీలు అవసరమైతే ఇస్తామని భరోసా కల్పించింది. గతంలో ఏ పరిశ్రమకూ ఇవ్వని విధంగా ఇండోసోల్‌పై ప్రోత్సాహకాల్ని కురిపించడంపై పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

పావలా పెట్టుబడికి రూపాయి ప్రోత్సాహకాలా?- ఆ సంస్థపై జగన్​ సర్కార్​కు ఎంత ప్రేమో! (ETV Bharat)



నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర రూ.25 వేల కోట్ల పెట్టుబడితో వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌ ప్యానళ్ల తయారీ పరిశ్రమను ఇండోసోల్‌ సంస్థ ఏర్పాటు చేస్తోంది. అందుకు భారీ మొత్తంలో ప్రోత్సాహకాల్ని ఇచ్చేందుకు జగన్​ సర్కార్​ ప్రత్యేకంగా ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. విద్యుత్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, గనుల లీజులు, చిన్న నీటి చెరువులు, ఇలా అవకాశం ఉన్నంత మేర ఇండోసోల్‌కు కట్టబెట్టింది. భౌతిక, ఆర్థిక ప్రోత్సాహకాలు 50 వేల కోట్ల రూపాయల వరకు ఉంటాయని పారిశ్రామిక వర్గాల అంచనా వేస్తుంది. ఇదే సంస్థ పీఎల్‌ఐ పథకం కింద విక్రయించిన ప్యానళ్ల ఆధారంగా కేంద్రం నుంచీ రాయితీలు పొందనుంది.

ఎన్నికల కోడ్ ముందు రోజు ఆ కంపెనీకి 17 వేల ఎకరాల భూమి-మేం వ్యతిరేకిస్తున్నాం: సీపీఐ - Indosol Land Allotments

ఇండోసోల్‌ సంస్థ డీపీఆర్‌ ఇవ్వడమే ఆలస్యం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. పరిశ్రమ ఏర్పాటుకు గతంలో అనుమతించిన 5 వేల 148 ఎకరాల కేటాయింపుతో పాటు అదనంగా 3 వేల 200 ఎకరాల సేకరణకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ భూములను కాస్ట్‌ బేసిస్‌ విధానంలో సేకరించి అప్పగించాలని ఏపీఐఐసీని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం లీజు ప్రాతిపదికన భూములను కేటాయించే విధానాన్ని సవరించి, ఔట్‌రైట్‌ సేల్స్‌ విధానంలో నేరుగా రిజిస్ట్రేషన్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటివరకు 2,959.61 ఎకరాల సేకరణకు రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అందులో 407 ఎకరాలకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారాన్ని చెల్లించి ఆ భూములను ఏపీ మ్యారిటైం బోర్డుకు రెవెన్యూ శాఖ అప్పగించింది.

ఇండోసోల్‌ కంపెనీతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరుగుతోంది: బాలశౌరి

పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించిన 8,348 ఎకరాల్లో 4.87% భూముల్నే రెవెన్యూ అధికారులు సేకరించారు. భూ సేకరణ పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు వచ్చాకే పరిశ్రమ నిర్మాణా పనులు మొదలు పెట్టాలి. ఇండోసోల్‌ సంస్థ మాత్రం భూ సేకరణ కొలిక్కి రాకుండానే 35 ఎకరాల్లో ఒక షెడ్డు ఏర్పాటు చేసి 500 గిగావాట్ల ప్యానళ్ల తయారీ సామర్థ్యం ఉన్న యూనిట్‌ను ఉత్పత్తిలోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇంత హడావుడిగా ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరం ఏంటి? ఎన్నికల తర్వాతి పరిణామాల దృష్ట్యా ఇలా చేస్తోందా? అనే అనుమానాలు పారిశ్రామిక వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ఒక పరిశ్రమ ఏర్పాటుకు ముందే ప్రోత్సాహకాలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుంది. అందుకు అంగీకరించాక ఒప్పందం కుదురుతుంది. ఇండోసోల్‌కు మాత్రం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రోత్సాహకాలు అవసరమైనా ఇస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇండోసోల్​ సంస్థకు విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, మైనింగ్‌ సంబంధిత మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. జగన్​ సర్కార్​ ఇండోసోల్​ సంస్థకు ప్రాజెక్టు ఏర్పాటుకు మద్దతు, ఫిజికల్‌ ఇన్సెంటివ్స్‌ ఇచ్చేందుకూ అంగీకరించింది.

ఇండోసోల్‌ సంస్థ మనోళ్లదే - ఎన్నికల కోడ్‌ వచ్చేలోపే దొచిపెట్టండి!

ఇండోసోల్‌ సంస్థకు 15 ఏళ్ల పాటు రాయితీపై విద్యుత్‌ ఇచ్చేలా నిర్ణయించింది. ఉత్పత్తిలోకి వచ్చిన మొదటి ఏడేళ్ల పాటు యూనిట్‌ 4 చొప్పున, తర్వాత ఎనిమిదేళ్లు రూ. 4.5 చొప్పున వినియోగించిన విద్యుత్‌కు బిల్లు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇతర పరిశ్రమల నుంచి వసూలు చేసే టారిఫ్‌ ప్రకారం యూనిట్‌కు సగటును 12 రూపాయల చొప్పున లెక్కిస్తే ఇండోసోల్‌ సంస్థ వినియోగించబోయే విద్యుత్‌కు సుమారు 47 వేల 809 కోట్ల రూపాయల రాయితీని భరించాల్సి వస్తుంది.

ఈ సంస్థకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు 220 కేవీ సబ్‌స్టేషన్‌ (KV Substation) ఏర్పాటుకు రూ. 70 కోట్లు, 30 కిలోమీటర్ల లైన్ల ఏర్పాటుకు 30 కోట్ల రూపాయల భారాన్ని ఇండోసోల్‌పై వేయకుండా ట్రాన్స్‌కో భరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. డిస్కం నుంచి విద్యుత్‌ సరఫరా పొందడానికి డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్‌లు, ఇతర పర్యవేక్షక ఛార్జీలకూ అధికార ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. పరిశ్రమల కోసం సేకరించిన భూములకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీని మినహాయించడం వల్ల రూ. 90 కోట్లు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ రూ. 4.5 కోట్ల మేర సంస్థకు లబ్ధి చేకూరుతుంది.

ప్రాజెక్టులు, కాంట్రాక్టులే కాదు విద్యుత్‌ కూడా జగన్ అస్మదీయులకే!- ఏకంగా 47వేల కోట్ల దోపిడీ


పరిశ్రమ కోసం సేకరించే భూముల విలువ రిజిస్ట్రేషన్‌ శాఖ నిబంధన ప్రకారం సుమారు రూ. 1200 కోట్లు అవుతుందని అంచనా. దీనిపై చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ 7.5% రాష్ట్ర ప్రభుత్వం మినహాయించింది. ఆ భూములను ఎస్పీవీలు, అనుబంధ యూనిట్లకు భూములను బదిలీ చేసే సమయంలో చెల్లించాల్సిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులను మినహాయించడంతో మరో రూ. 100 కోట్ల లబ్ధి చేకూరుతుందని అంచనా. కేటాయించిన భూములకు ల్యాండ్‌ కన్వర్షన్‌ ఛార్జీలు, బిడ్డింగ్‌ పర్మిషన్, ప్రాసెసింగ్‌ ఛార్జీలు, సైట్‌ జోనింగ్‌ ఛార్జీలు, ప్రాపర్టీ, మున్సిపల్‌, పంచాయతీ పన్నులు, అభివృద్ధి ఛార్జీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా సంస్థ ఆర్థికంగా మరో రూ.100 కోట్లు ప్రయోజనం పొందుతుంది. భవనాల నిర్మాణానికి అవసరమైన గ్రావెల్, మట్టి, ఇసుక, రోడ్‌ మెటల్, రఫ్‌ స్టోన్, బౌల్డర్స్, ఇతర చిన్న ఖనిజాలకు రాయల్టీ, సీనరేజీ రుసుము మినహాయింపు వల్ల కనీసం రూ. 50 కోట్ల లబ్ధి కలుగనుంది. ఆ సంస్థకు మొత్తం ఆర్థిక ప్రోత్సాహకాలు రూ. 48,254 కోట్లు ఉంటుందని అంచనా.

ఇండోసోల్‌కు అవసరమైన క్వార్ట్జ్‌ గనులను కట్టబెట్టడానికి వీలుగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మైనింగ్‌ లీజు, తవ్వకాలకు సంబంధించి ప్రీమియం ఎమౌంట్, సీనరేజీ ఫీజు, జిలా ఖనిజ నిధి, కన్సిడరేషన్‌ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని గనుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 18 గనుల లీజుల కోసం ఇండోసోల్​ సంస్థ దరఖాస్తు చేసింది. వాటిలో 10 అటవీ భూములు కాగా, మిగిలిన 8 గనుల లీజులు ప్రభుత్వ భూములే. ప్రకాశం జిల్లాలో 157.75 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 119.1 ఎకరాల్లో కలిపి ఆరు లీజుల కేటాయింపునకు గనుల శాఖ ఎన్‌వోసీ ఇచ్చింది. 10 ఏళ్ల పాటు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ శాఖ ఇచ్చే రాయల్టీ, ఇతర ఫీజుల మినహాయింపుల ద్వారా పొందే లబ్ధి అదనం.

సొంత జాగీరులా అస్మదీయ కంపెనీలకు ట్రాన్స్‌కో నిధులు దోచిపెడుతున్నారు: లంకా దినకర్​

కనిగిరి జలాశయం, సంగం బ్యారేజి, సోమశిల నుంచి 115 ఎంఎల్‌డీ నీటిని పరిశ్రమ కోసం అందించాలని పేర్కొంటూనే దీనికి సమీపంలో ఉన్న రావూరు చెరువు, చేవూరు మినీ ట్యాంకు, చెన్నాయపాలెం చెరువుల్లో నీటిని నిల్వ చేసుకోవడానికి, ప్రాజెక్టు నీటి నిల్వ అవసరాలు తీర్చడానికి కేటాయించే అవకాశాలను పరిశీలించాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. వందల ఎకరాల విస్తీర్ణం ఉన్న మూడు చెరువులను ఇండోసోల్‌ నీటి అవసరాలకు కేటాయించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలొస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.