ETV Bharat / state

ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తికి గుండెపోటు - మార్గమధ్యలోనే మృతి - Voter Dies in Polling Queue

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 2:34 PM IST

Voter Dies in Polling Queue: ఆంధ్రప్రదేశ్​లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు వచ్చి ఓ వ్యక్తి మృతి చెందారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటు వేయటానికి వచ్చిన కలగాల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందారు.

Voter Dies in Polling Queue
Voter Dies in Polling Queue (ETV Bharat)

Voter Dies in Polling Queue: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పెద్దపులిపాక గ్రామంలో ఓటు వేసేందుకు వచ్చిన కలగాల వెంకటేశ్వరరావు (82) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. పెదపులిపాక ఎంపీపీ స్కూల్‌లో ఓటు వేయడానికి వచ్చిన వెంకటేశ్వరరావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే వెంకటేశ్వరరావు మృతి చెందారు.

శాంతిభద్రతలు కాపాడలేకపోయారు - పల్నాడులో హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆందోళన - Chandrababu on Clashes in Palnadu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.