ETV Bharat / state

డ్రగ్స్​ కేసుల్లో ఎంత పెద్ద సెలబ్రిటీలున్నా వదలొద్దు - తెలంగాణను మాదక ద్రవ్యాల​ రహిత రాష్ట్రంగా మార్చాలి: సీఎం రేవంత్ - REVANTH REDDY ON DRUGS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2024, 7:25 AM IST

Updated : May 26, 2024, 7:59 AM IST

Telangana CM Revanth Reddy On Drugs: బంజారాహిల్స్​లోని కమాండ్​ కంట్రోల్​ సెంటర్​కు తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి తొలిసారి వెళ్లారు. అనంతరం సీఎం డ్రగ్స్​ నిర్మూలనకు తీసుకోవాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో మరింత యాక్టివ్​గా పని చేయాలని వివరించారు.

Telangana CM Revanth Reddy On Drugs
Telangana CM Revanth Reddy On Drugs (ETV Bharat)

Telangana CM Revanth Reddy On Drugs : డ్రగ్స్​ పదం వింటేనే భయపడేలా పోలీసుల చర్యలు ఉండాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి బంజారాహిల్స్​లోని కమాండ్​ కంట్రోల్​కు సీఎం రేవంత్​ రెడ్డి వెళ్లారు. అక్కడకు చేరుకున్న సీఎంకు సీఎస్​ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం సైబర్​ సెక్యూరిటీ వింగ్​, డ్రగ్స్​ కంట్రోల్​ వింగ్​ సెంటర్లను సీఎం పరిశీలించారు. ఆ తర్వాత డ్రగ్స్​ నిర్మూలనకు తీసుకోవాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు నార్కోటిక్​ బ్యూరో డైరెక్టర్​ సందీప్​ శాండిల్య హాజరయ్యారు. అలాగే జీహెచ్​ఎంసీ కమిషనర్​, విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు సమీక్షకు హాజరు అయ్యారు.

రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచిన వైసీపీ- దేశం అస్తిత్వానికే ముప్పు ఏర్పడే పరిస్థితి - Drugs Usuage in ap

గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై సమీక్ష : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో మరింత యాక్టివ్​గా పని చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్​ డ్రైవ్స్​ నిర్వహించాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని, గంజాయి, డ్రగ్స్​ సరఫరా చైన్​ను బ్రేక్​ చేయాలని ఆదేశించారు. సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలు ఉండాలని హెచ్చరించారు. డ్రగ్స్​ కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్​ టీమ్స్​ను ఏర్పాటు చేయండని తెలిపారు. డ్రగ్స్​ నిర్మూలన కోసం ఎఫెక్టివ్​గా పని చేసేవారిని ప్రోత్సహించండని చెప్పారు. డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. తెలంగాణను డ్రగ్స్​ రహిత రాష్ట్రంగా మార్చాలని పిలుపునిచ్చారు.

వర్షాకాల వరదలపై సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష : హైదరాబాద్​ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సీఎం రేవంత్​ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమీక్షలో సూచించారు. ఔటర్​ రింగ్​ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్​గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని అన్నారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థ ఉండాలని తెలిపారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలని ఆదేశించారు. జూన్​ 4 లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని, నాళాల పూడికతీతలో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు.

వైసీపీ పాలనలో అన్ని రంగాలు లాస్ట్​ - డ్రగ్స్​ స్మగ్లింగ్​లో దేశంలోనే టాప్​ - DRUGS SMUGGLING IN AP

పూడిక తీసిన చెత్తను సమీప ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు రేవంత్​ రెడ్డి ఆదేశించారు. క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు తరలించేలా చర్యలు ఉండాలన్నారు. కోడ్​ ముగిసిన తరవాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని చెప్పారు. నిర్లక్ష్యంగా వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. పని చేసే వారిని ప్రోత్సహిస్తాం, అలాగే వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు.

విశాఖకు కంటెయినర్‌లో వచ్చింది డ్రగ్సే - సీబీఐ నివేదికలో వెల్లడి - Visakhapatnam Drugs Case

Last Updated : May 26, 2024, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.